Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ యువత ఇంటికే నేరుగా ఎపిక్ కార్డులు
అ ఓటర్లను చైతన్య వంతులుగా చేయాలి
అ జిల్లా కలెక్టర్ టి. వినరు కష్ణా రెడ్డి
నవతెలంగాణ -సూర్యాపేటకలెక్టరేట్
ప్రజాస్వామ్య పరిపాలన వ్యవస్థలో ఓటరుదే కీలక పాత్ర అని, దేశాభివద్ధికి సుపరిపాలన అందించే మంచి నాయకున్ని ఎన్నుకునే అవకాశం ఓటర్లకు ఉందని జిల్లా కలెక్టర్ టి. వినరు కష్ణా రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన 12వ జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును నిర్భయంగా, స్వేచ్చగా వినియోగించుకోవాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరు తమ పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి సంవత్సరం ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరుగుతుందని 18 ఏండ్లు యువత ఓటరుగా తమ పేరును నమోదు చేయించుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఓటర్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయుటకు నిర్ణయించిందని, దీని ద్వారా డూప్లికేట్ ఓటర్లకు అవకాశం ఉండదని తెలిపారు. కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వారికి డీఆర్ఓ రాజేంద్రప్రసాద్ తో కలసి కలెక్టర్ ఎన్నికల ఫొటో గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఓ శ్రీదేవి, తహశీల్దార్ వెంకన్న, పర్యవేక్షకులు సుదర్శన్ రెడ్డి, డీటీ ఎలక్షన్స్ కళ్యాణ్ కుమార్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.