Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ సంస్థాన్ నారాయణపురం
ప్రమాదవశాత్తు చెరువులో పడి పదవ తరగతి విద్యార్థి మతి చెందిన సంఘటన గురువారం మండలంలోని రాచకొండలో చోటుచేసుకుంది. ఎస్ఐ యుగంధర్ తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామానికి చెందిన భోగి ఉపేందర్ 16 రాచకొండ సందర్శనకు వెళ్లారు. ప్రమాదవశాత్తు తూంబారు తండా సమీపంలో గల నార్లకుంట చెరువులో పడి మతి చెందాడు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లి చూడగా ఉపేందర్ చెరువులో శవమై కన్పించాడు. మతుని తండ్రి సంగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.