Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డీఈఓ భిక్షపతి
నవతెలంగాణ-నకిరేకల్
ఆన్లైన్ తరగతులకు విద్యార్థులు తప్పక హాజరయ్యేలా చూడాలని నల్లగొండ డీఈఓ భిక్షపతి సూచించారు. గురువారం మండలంలోని తాటికల్ జిల్లా పరిషత్ పాఠశాల, నకిరేకల్ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి పరిశీలించారు. విద్యార్థులు ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్నారా, 50 శాతం మంది ఉపాధ్యాయులు విధులకు వస్తున్నారా లేదా అని పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్లైన్ తరగతులకు హాజరయ్యే విద్యార్థులను నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. ఆయన వెంట ఉపాధ్యాయులు ఉన్నారు.