Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నేరేడుచర్ల
ఎలక్ట్రికల్ డే సందర్భంగా గురువారం మండలంలోని ప్రధాన కూడలి వద్ద థామస్ ఆల్వా ఎడిసన్ చిత్రపటానికి ఎలక్ట్రికల్ కార్మికులు పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం ఉమ్మడి నేరేడుచర్ల ఎలక్ట్రిషన్ యూనియన్ అధ్యక్షులు వంగాల రవీంద్రచారి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు రాజమల్లు నరేష్ సహాయ కార్యదర్శి వెంకటాచారి కోశాధికారి భూపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఓవరాల రాంబాబు, నర్సిరెడ్డి, పోరెడ్డి శ్రీనివాస్రెడ్డి, కిరణ్, సైదులు, పాండు పాల్గొన్నారు.