Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నల్లగొండ
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసి నిరుద్యోగభతి వెంటనే ఇవ్వాలని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పాల్వాయి జితేందర్రెడ్డ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నల్లగొండ ఎంపీ ఉత్తమకుమార్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగులు జిల్లాలలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పుట్ట రాకేష్ ముదిరాజ్ అద్వరంలోజరిగిన సమావేశంలో నకిరేకల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మెరెడ్డి ప్రవీణ్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు చిట్టెడి దేవేందర్ రెడ్డి , బోయ సురేష్, అంజన్ కుమార్, బండారు ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.