Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతపల్లి
చింతపల్లి నూతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై రామాంజనేయులును మండల కల్లుగీత వత్తిదారుల సమన్వయ కమిటీ అధ్యక్షులు అనంతుల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో గౌడ సంఘం నాయకులు శాలువతో సన్మానించారు. కార్యక్రమంలో వికలాంగుల జిల్లా అధ్యక్షులు జెల్ల నరసింహ గౌడ్, చింతపల్లి మండల కన్వీనర్ అనంతుల జంగయ్య గౌడ్, గౌడ సంఘం జిల్లా నాయకులు పందుల యాదయ్య గౌడ్, మండల నాయకులు గండు శీనుగౌడ్, అనంతుల పవన్ గౌడ్ పాల్గొన్నారు.