Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరి
యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ చెన్న వెంకటేష్ అంతక్రియలు భువనగిరి హన్వాడలోని భైరవ శ్మశానవాటికలో నిర్వహించారు. ఆయన మతికి సంతాపంగా బ్యాంకు చైర్మెన్ , డైరెక్టర్లు సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నివాళులర్పించారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ జడల అమరేందర్ గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు కొలుపుల అమరేందర్, మున్సిపల్ చైర్మెన్ ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, బ్యాంకుచైర్మెన్ జయిని రమేష్, డైరెక్టర్లు కొలుపుల వివేకానంద, చల్లా గురుకుల రఘు బాబు, మందాడి వెంకట్ రెడ్డి, సోమ రాజిరెడ్డి, మంచాల ప్రభాకర్, నువ్వుల సుధాకర్, ఎడవెల్లి నవిన్, భౌతిక గాయాన్ని సందర్శించి పుష్పగుచ్చం వేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.