Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ సర్పంచ్ పదవి బాధ్యతలు స్వీకరించి మూడు పర్యాయాలు పూర్తి చేసుకొని నాల్గవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సర్పంచ్ బుర్రి రవీందర్ రెడ్డి, ఉపసర్పంచ్ సాగర్ల నరేష్, వార్డు మెంబర్లకు టీఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరెే విధంగా కృషి చేస్తానన్నారు. ఈ ముడు సంవత్సరాలు సహకరించేందుకు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు దామనూరి పృధ్వీ, ప్రదాన కార్యదర్శి వేంపాల నరసింహ, టీఆర్ఎస్వీ అధ్యక్షుడు సిరిపంగి మహేందర్, పార్టీ నాయకులు చొల్లేటి రవి నర్సిరెడ్డి, ఉయ్యాల నాగరాజు పాల్గొన్నారు.