Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
నవతెలంగాణ-ఆలేరుటౌన్
మలిదశ తెలంగాణ ఉద్యమంలో ధూంధాం పాత్ర కీలకమని, అందులో అనేక మంది కళాకారులు గొంతు కలిపి ముందుకు సాగారని,అలుపెరుగకుండా అమోఘమైన పాత్ర పోషించారని ఇవన్నీ యాది చేసుకున్నప్పుడుల్లా మనస్సు ఆనందంతో ఉప్పొంగిపోతుందని తెలంగాణ ధూంధాం వ్యవస్థాపకులు, మానకొండూరు ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కతిక సారథి చైర్మెన్ రసమయి బాలకిషన్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ నుండి వరంగల్ వెళుతూ మార్గమధ్యంలోని ఆలేరులో తెలంగాణ ధూంధాం గాయకురాలు ఉత్తమ మహిళా ఉద్యమ గాయని ధర్మారం మాజీ సర్పంచ్ మందుల విజయకష్ణ నివాసంలో తేనేటి విందును స్వీకరించి ఇలా వ్యాఖ్యానించారు.కళాకారుల జీవితాల్లో వెలుగు నింపుటకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ అవకాశాలు కల్పించడం గర్వ కారణమన్నారు.మూడో సారి తెలంగాణ సాంస్కతిక సారథి చైర్మెన్గా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి తన నివాసానికి వచ్చిన సందర్భంగా మందుల విజయకష్ణ రసమయి బాలకిషన్కు సాదర స్వాగతం తెలుపుతూ శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంలో విజయకష్ణ కుటుంబసభ్యులతో పాటుగా జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ ఆడెపు బాలస్వామి పాల్గొన్నారు.