Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలో రైతు వేదికల ద్వారా వివిధ రకాల పంటసాగు విధానంపై రైతుబంధు సభ్యులు, వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తూ మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ టి.వినరు కష్ణారెడ్డి అన్నారు.సోమవారం కలెక్టరేట్ నందు రైతు బంధు వార్షిక క్యాలండర్ను రైతుబంధు జిల్లా అధ్యక్షులు ఎస్ఏ.రజాక్, అదనవు కలెక్టర్లు ఎస్.మోహన్రావు, పాటిల్హేమంత్కేశవ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామారావునాయక్లతో కలిసి ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. జిల్లాలో రైతులకు రైతు బంధు సమితి సభ్యులు, వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండి పంటల సాగు విధానం పై రైతు వేదికల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్ర వ్యవసాయ,రైతు బంధు సమితి ద్వారా జిల్లాకు అందిన 2340 వార్షిక క్యాలండర్లను జిల్లాలోని అన్ని వ్యవసాయ శాఖ కార్యాలయాలు, ఇతర శాఖల కార్యాలయాలలో అలాగే మండల, గ్రామ స్థాయిలో రైతు బంధు కో ఆర్డినేటర్లకు కూడా అందచేయాలన్నారు.అనంతరం అదనపు కలెక్టర్ మోహన్రావుతో కలిసి వివిధ సమస్యలపై ప్రజలు అందచేసిన దరఖాస్తులను స్వీకరించి పరిశీలించారు.ఈ కార్యక్రమంలో రైతుబంధు జిల్లాసభ్యులు, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.