Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోటకొండూరు
డ్రగ్స్ నిర్మూలనలో ప్రజలు,విద్యార్థులు,యువకులు భాగస్వామ్యమై పూర్తిగా నిషేధించాలని యాదగిరిగుట్ట రూరల్ సీఐ నవీన్ రెడ్డి తెలిపారు.గురువారం మోటకొండూరు మండలకేంద్రంలోని ఆదర్శపాఠశాలలో ఏర్పాటు చేసిన డ్రగ్స్, మారకద్రవ్యాల నిర్మ్షులన అవగాహనా సదస్సులో ఆయన మాటా ్లడారు. డ్రగ్స్ నిర్మూలన కమిటీ ఏర్పాటు చేసినట్లు ,డ్రగ్స్ మారకద్రవ్యాలు లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దీపిక, మోటకొండూర్ ఎస్ఐ నాగరాజు,ఆలేర్ ఎస్ఐ ఇద్రీస్ అలీ , ఉపాధ్యాయులు విద్యార్థులు పోలీస్ సిబ్బంది, పోలీసు కళాబందం పాల్గొన్నారు.