Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వీఆర్ఏల సంఘం జేఏసీ రాష్ట్ర చైర్మెన్ రాములు
నవతెలంగాణ-భువనగిరిరూరల్
వీఆర్ఏలకు పేస్కేల్ జీఓను వెంటనే విడుదల చేయాలని,అర్హత కలిగిన వారికి ప్రమోషన్స్ ఇవ్వాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర జేఏసీ చైర్మెన్ వంగూరి రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.వీఆర్ఏల సమస్యలపై రాష్ట్రసంఘం ఐక్య కార్యాచరణ కమిటీ ఇచ్చిన పిలువులో భాగంగా ఆ సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు కల్లూరి మల్లేశం అధ్యక్షతన కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ 2020 సెప్టెంబర్ 09న శాసనసభలో నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రతిపాదిస్తూ వీఆర్ఓలను రద్దు చేసి వీఆర్ఏలకు పేస్కేల్ ఇస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని అమలుచేయాలని డిమాండ్ చేశారు.2017 ఫిబ్రవరి24 న వీఆర్ఏలకు ప్రమోషన్స్ ఇస్తామని,వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి నేటికి ఐదేండ్లవుతున్నా నేటికి అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం స్పందించనిపక్షంలో ఈనెల 22 న చలో ఇందిరాపార్క్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు.ధర్నాకు సీఐటీయూ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు కోమటిరెడ్డి చెంద్రారెడ్డి, దాసరి పాండు మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకురాలు కైరంకొండ బాలమణి, నాయకులు బోళ్లభాషయ్య,గిరి, వివిధమండలాల అధ్యక్షులు కె.స్వామి, దశరథ, వెంకన్న,పసులరమేశ్,పెంటయ్య,గడ్డం శ్రీనివాస్, ఉషయ్య,మైసయ్య,కోట నర్సింహ,నర్సింహ, కష్ణ,శ్రీనివాస్,నాయకులు పోతరాజు జహంగీర్, మంచాల మధు, ఉడుత భాస్కర్, బోయిన నర్సింహ,నాయకులు ధనలక్ష్మీ, సంతోష ,సాయి, భిక్షమయ్య, నాయకులు బింగి శ్రీనివాస్,మాధవరెడ్డి, అర్జున్,జానీ పాల్గొన్నారు.
నల్లగొండ :అసెంబ్లీలో 2020 సెప్టెంబర్ 9న నూతన రెవెన్యూ చట్టం చేస్తూ వీఆర్ఎలందరికీ పే స్కేల్ అమలు చేస్తానని ఇచ్చిన హామీని వెంటనే జీవో ఇచ్చి అమలు చేయాలని లేకపోతే పోరాటాన్ని ఉదృతం చేస్తామని వీఆర్ఏల సంఘం రాష్ట్ర జేఏసీ చైర్మన్ వంగూరు రాములు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వీఆర్ఏ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు నల్గొండ కలెక్టరేట్ ముందు గురువారం భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ లో సీఎం ఇచ్చిన హామీని అమలు చేయడంలో గత18 నెలలుగా నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. వీఆర్ఏలు అందరూ దళిత బడుగు బలహీన వర్గాలకు చెందిన వారని, తరతరాలుగా ఆ వ్యవస్థలో అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్నారని వారికి న్యాయం చేసే విధంగా 55 సంవత్సరాలు పైబడిన వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. వీఆర్ఏలలో అనేకమంది డిగ్రీలు, పీజీలు చదువుకొని పనిచేస్తున్నారని, రెవెన్యూ శాఖలో ఖాళీ పోస్టుల్లో ప్రమోషన్ ఇచ్చి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే రెవెన్యూ వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తోందని, అందులో భాగంగానే రెవెన్యూ మంత్రి, సీసీఎల్ఏ, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీని నియమించలేదన్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, డైలీ వేజ్, పార్ట్ టైం ఫుల్ టైం, ఆశ, అంగన్వాడి ఉద్యోగులందరికీ పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచిందని, మరి వీఆర్ఏలకు ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వీఆర్ఏలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఈనెల 22న చలో హైదరాబాద్ తర్వాత నిరవధిక సమ్మె తప్పదని హెచ్చరించారు. ఈ మహా ధర్నా కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చినపాక లక్ష్మీనారాయణ, తుమ్మల వీరారెడ్డి, రెండు వీఆర్ఏల సంఘాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మొసంగి అంజయ్య, గన్నెబోయిన శ్రీనివాస్, గంటెకంపు శ్రీనివాస్, వంటెపాక రాంబాబు, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, సంఘం రాష్ట్ర నాయకులు ఎల్.నరసింహారావు, టి.సాల్మన్, రామచంద్రయ్య, జ్యోతి, యాదయ్య, నార్ల శ్రీనివాస్, వీరయ్య, బుచ్చయ్య, జగన్, మృధుల, ఎలమంద పాల్గొన్నారు.