Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్పహాడ్
నిత్యం ప్రజల కోసం పరితపించిన ప్రజల మనిషి ధనియాకుల గురవయ్య అని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అన్నారు. మండల పరిధిలోని నాగులపాటి అన్నారం గ్రా మంలో శుక్రవారం గురవయ్య స్మారక సభలో పా ల్గొన్న ఆయన మాట్లాడుతూ పేద వ్యవసాయ కుటుంభంలో పుట్టి పాలేరుగా జీవితాన్ని కూడగట్టి పేద ప్రజల కష్టాలు తెలుసుకొని పేదప్రజలను కూ డగట్టి, పేదలకు ఇండ్ల స్థలాలు, పేదలకు భూములు పంచిన నిజమైన ప్రజా నాయకుడు దనియాకుల గురవయ్య అని ఆయన కొనియాడారు. రానున్న రోజుల్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సామాన్య జనాన్ని కూడగొట్టి ఉద్యమాలు చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు వీరబోయిన రవి, మండల కార్యదర్శి రణపంగి కృష్ణ, వగ్గు వెంకన్న, దాసరి మైసయ్య పాల్గొన్నారు.