Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
దివంగత కల్నల్ సంతోష్బాబు 39 వ జయంతి సందర్భంగా ఆయన సతీమణి,డిప్యూటీ కలెక్టర్ బిక్కుమళ్ల సంతోషి, ఆయన కుమారుడు, కుమార్తెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఆదివారం జిల్లాకేంద్రంలోని కోర్టు చౌరస్తాలోని కల్నల్ సంతోష్బాబు విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త 39వ జయంతిని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.ఆయన జన్మదినం సందర్భంగా వివేకా నంద వృద్ధాశ్రమం నందు వృద్ధులకుఅన్నదానం నిర్వహించినట్టు చెప్పారు.అనంతరం సాయిబాబా ఆలయంలో ప్రసాద వితరణతో పాటు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కల్నల్ మామ,విశ్రాంత ఉపాధ్యాయుడు తల్లాడ వెంకటేశ్వరరావు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.