Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు ఎడ్ల వెంకటస్వామి
నవతెలంగాణ-జఫర్గడ్
కాంపౌండ్ వాల్కు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్సీ బండ ప్రకాష్ కు ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎడ్ల వెంకట స్వామి అభినందనలు తెలిపారు. మంగళవారం ఆయన నివాసంలో కలిసి బోకే ఇచ్చి అభినందించారు. ముదిరాజ్ సంఘం భవనానికి, కంపౌండ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరిన వెంటనే ఎమ్మెల్సీ నిధుల నుండి 5 లక్షల రూపాయలు, భవనం కాంపౌండ్ హాలుకు మంజూరు చేశారన్నారు. మాజీ ఎంపీపీ సింగారపు కొమరమ్మ రఘునాథ్ పల్లి ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మట్టపల్లి బుజ్జయ్య, ప్రధాన కార్యదర్శి ఏ అశోక్, దండు ఆగయ్య ఏ ఉప్పలయ్య ఏ ఎల్లయ్య నా రెల్లి ఎల్లయ్య, నారెల్లి కుమారస్వామి, గుర్రాల సంతోష్, సింగారపు అశోక్, తదితరులు పాల్గొన్నారు.