Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నర్సరీ తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ
నవతెలంగాణ -మర్రిగూడ
నర్సరీ లలో మొక్కలు పెంపకం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. గురువారం మర్రిగూడ మండలం లెంకల పల్లి గ్రామంలో నర్సరీ, పల్లె ప్రకతి వనాలను ఆయన తనిఖీ చేశారు. మొక్కలు వేసవిలో ఎండ తీవ్రతకు చనిపోకుండా షేడ్నెట్ ఏర్పాటు చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. నర్సరీ, పల్లె ప్రకతి వనంలో మొక్కలకు ప్రతిరోజూ నీళ్లు పోయాలని సూచించారు. రైతు వేదిక ఆవరణలో మొక్కను నాటి నీరు పోశారు. అనంతరం గ్రామంలో చేపల పెంపకం యూనిట్లను జిల్లా మత్స్య శాఖ ఏడీ వెంకయ్యతో కలిసి తనిఖీ చేశారు. ఆయన వెంట ఎంపీడీఓ, ఎంపీఓ, అధికారులు ఉన్నారు.