Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భువనగిరి :భువనగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళితునికి దళితబంధు అమలు చేయాలని సీపీఐ(ఎం) మున్సిపల్ కార్యదర్శి మాయ కష్ణ అన్నారు. శుక్రవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పట్టణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితబంధు పథకం నియోజకవర్గానికి వంద మందికి మాత్రమే పరిమితం చేస్తూ అర్హులైన దళితులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. దళిత బందు అమలు చేసే విషయంలో రాజకీయ నాయకుల జోక్యం లేకుండా ప్రభుత్వ అధికారులకు పూర్తి హక్కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ పట్టణ కమిటీ సభ్యులు బందేల ఎల్లయ్య, వల్దాసు అంజయ్య పాల్గొన్నారు.