Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
మండలకేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ రాష్ట్ర కబడ్డీ బోర్డు నిర్వహించే రిఫరీ (ఎంపైర్) ఎగ్జామ్ను ఆదివారం ఉమ్మడినల్లగొండ జిల్లా సహకార కేంద్రబ్యాంకు చైర్మెన్, కబడ్డీ అసోసియేషన్ జిల్లా గొంగిడి మహేందర్రెడ్డి ప్రారంభించారు. మహిళలు,పురుషులు కలిసి 167 మంది అభ్యర్థులు పాల్గొన్నారు.అనంతరం ఆయన్ను జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పూల నాగయ్య శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర రిఫరీ బోర్డు చైర్మెన్ గోవిందరాజులు, కన్వీనర్ అనిల్ ,జాయింట్సెక్రెటరీ నర్సింగరావు, వ్యాయామ, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.