Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంస్థాన్నారాయణపురం
గిరిజనులపై అటవీఅధికారుల వేధింపులను వెంటనే ఆపాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దోనూరి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు.ఆదివారం ఆ పార్టీ నాయకులు ఎండి.పాషా, బండారు నర్సింహలతో కలిసి రాచకొండగుట్టల్లో గిరిజనులతో మాట్లాడారు.70 ఏండ్లుగా గిరిజనులు ప్రభుత్వభూమిని సాగు చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు.అటవీ అధికారులు గిరిజనులపై వేధింపులకు పాల్పడుతుండడం సరికాదన్నారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను ఆన్లైన్లో నమోదు చేసి అన్ని హక్కులు కల్పించాలన్నారు.ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.గిరిజనులు ఎం.సోమయ్య,రమావత్ లచ్,మెగావత్ బుగ్గ,రోక్యా, శ్రీకాంత్, లక్ష్మీ, రాజు, బజ్జీ, ఐకమ్మ, లక్సమ్మ, కళమ్మ పాల్గొన్నారు.