Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర రెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం పట్టణకేంద్రంలోని దీప్తి హోటల్లో అభిమానులు ఘనంగా నిర్వహిం చారు. అభిమానులు పూలమాలలతో శాలువా తో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్మదిన వేడుకల సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడం ఆనందంగా ఉందన్నారు. నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పని చేస్తున్నానని తెలిపారు. టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయన్నారు. యువత కుల, మతాలకతీతంగా దేశ అభివద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుతాడి సురేష్, వల్లపు విజరు, టిఆర్ఎస్ శ్రేణులు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.