Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నకిరేకల్:నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని టీపీసీసీి నియోజకవర్గ కోఆర్డినేటర్ కసుబ శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం పట్టణంలో ఈ పార్టీ డిజిటల్ సభ్యత్వ లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో వందశాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో టీపీసీసీరాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్ మండల అధ్యక్షుడు నకిరేకంటి ఏసుపాదం, పార్టీ జిల్లా నాయకులు పన్నాల రాఘవరెడ్డి ,గార్లపాటి రవీందర్ రెడ్డి లింగాల వెంకన్న, కొండ శంకర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు మే రెడ్డి ప్రవీణ్ రెడ్డి, నాయకులు సల్ల నరేష్ , బ్రహ్మదేవర రమేష్ , గునగంటి రాజు, తదితరులు పాల్గొన్నారు.