Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
ఈనెల 21,22 తేదీల్లో చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని జయశ్రీ గార్డెన్ లో నిర్వహించిన ఎస్ఎఫ్ఐ జిల్లా మహాసభల సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా బుర్ర అనిల్,వనం రాజు ఎన్నికయ్యారు.నూతన జిల్లా కమిటీని 21 మందితోఎన్నుకున్నారు. జిల్లా ఉపాధ్యక్షులుగా పల్లె శివ ,వేముల నాగరాజు, సూరేపల్లి మౌనిక, జిల్లా సహాయ కార్యదర్శులుగా చింతల శివ, సందెల రాజేష్ ,కాసుల నరేష్ ,లావుడియా రాజులను ఎన్నుకున్నారు. ఈ మహాసభలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పైన చర్చించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై విద్యార్థులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.