Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు గోవర్ధన్
నవతెలంగాణ-వలిగొండ
కళ కళ కోసం కాదని ప్రజల కోసమని ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు అవ్వారు గోవర్ధన్ అన్నారు. శుక్రవారం ప్రజానాట్యమండలి మండల మహాసభ స్థానిక రోసరీ పాఠశాలలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజానాట్యమండలి నిత్యం ప్రజాసమస్యలు పరిష్కారం కోసం తమ గళంతో పనిచేస్తుందన్నారు. కళాకారుల కోసం బస్ సౌకర్యం కల్పించాలన్నారు. అనంతరం మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా రుద్ర వరపు రామలింగం కార్యదర్శిగా కొమ్ము స్వామి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి దేశభక్తి రవి నాయకుడు ,శ్రీరాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు మేడి ముకుంద, వీర్లపల్లి ముత్యాలు ,పాలు సన్ లింగం, తదితరులు పాల్గొన్నారు .