Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరి రూరల్
ఉపాధి కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బుగ్గ నవీన్, గడ్డం వెంకటేష్ అన్నారు. శుక్రవారం జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. యువతకు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,91,126 ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. కార్యాలయంలో అధికారి లేకపోవడంతో కుర్చీకి వినతి పత్రం అందజేసినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల మల్లేష్,ఈర్లపల్లి కార్తిక్, సాయి లు పాల్గొన్నారు.