Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీి(ఐ)ఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
సీపీి(ఐ)ఎం సీనియర్ నాయకులు మేకల దుల్లయ్య బొందులయ్య ఆశయాలను కొనసాగిస్తామని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి .జహంగీర్ అన్నారు. సోమవారం అనారోగ్యంతో మతి చెందిన బొందయ్య భౌతికకాయాన్ని ఆయన సందర్శించారు. ఎర్ర జెండా కప్పి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 ఏండ్లుగా ఈ ప్రాంతాల్లో గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎంతో కషి చేసినట్టు తెలిపారు. పార్టీ అభివద్ధికి ఆయన చేసిన కషిని కొనియాడారు. తుది శ్వాస విడిచే వరకు నిజమైన కమ్యూనిస్టుగా జీవించారన్నారు. ఆయన ఆశయాలను పార్టీ ఎప్పటికి మరువదన్నారు. ఆయన అకాల మతి పార్టీ కి కుటుంబానికి తీరని లోటు అన్నారు. ఆయన మతి పట్ల కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సంతాపం ప్రకటించిన వారిలో యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దోనూరి నర్సిరెడ్డి, నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాసాచారి, మాటూరి బాలరాజు, సీనియర్ నాయకులు సురకంటి శ్రీనివాస్ రెడ్డి, మండల కార్యదర్శి దొడ యాదిరెడ్డి, దొంతగాని పెద్దలు, చింతకాయల నరసింహ, దుబ్బాక లక్ష్మీనారాయణ, మేకల వెంకటయ్య, మేకల సత్తయ్య, పిట్ట రాములు, జి సుదర్శన్చారి, అయితరాజు గాలయ్య పాల్గొన్నారు.