Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దామరచర్ల
ఓ వ్యక్తి తాగుతున్న చుట్ట...అదే వ్యక్తి ప్రాణాలను బలిగొన్న సంఘటన బుధవారం దామరచర్లలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం...దామరచర్లకు చెందిన కుందూరు సైదిరెడ్డి ఎప్పటి మాదిరిగానే గత నెల 18వ తేదీన ఉదయం చుట్ట కాల్చుతుండగా దాని నిప్పురవ్వలు అతని పంచెలో పడ్డాయి. దీంతో పంచెకు నిప్పంటుకోవడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే అతని చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు.చికిత్స పొందుతున్న అతను బుధవారం చనిపోయాడు.మతుని కుమారుడు జానకిరాంరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.