Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సూర్యాపేట అదనపు కలెక్టర్ మోహన్రావు
నవతెలంగాణ -సూర్యాపేట కలెక్టరేట్
ప్రజావాణిలో అందిన దరఖాస్తులను సత్వరమే పరిశీలించి చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ ఎస్. మోహన్ రావు సంబంధిత అధికారులను అదేశించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరములో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన దరఖాస్తులను స్వీకరించి మాట్లాడారు. ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించాలని, అలాగే ప్రజావాణిలో జిల్లా అధికారులు తప్పక హాజరు కావాలని సూచించారు. భూసమస్యలకు సంబంధించిన దరఖాస్తులు 24 అందాయని , ఇతర శాఖలకు సంబందించిన దరఖాస్తులు 21 మొత్తం 45 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ధరఖాస్తులను పరిశీలించి అర్హత మేరకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీయస్ పీడీ జ్యోతి పద్మ, సంక్షేమ అధికారులు శంకర్, అనసూర్య,ఎఫ్. డి.ఓ సౌజన్య వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.