Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నార్కట్పల్లి
ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నార్కట్ పల్లి ఆర్టీసీ డిపో కండక్టర్ ఆకవరం సమత కు విశిష్ట సేవా పురస్కారం ప్రదానం చేశారు. నల్గొండ జిల్లా కేంద్రం లోని హైదరాబాద్ రోడ్డు లో ఉన్న విశ్వకర్మ భవన్ లో నిర్వహించారు ఈ సమావేశంనకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన హైకోర్టు న్యాయవాది పోలోజు విజయలక్ష్మీ పాల్గొని ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ 13 సంవత్సరాలు రవాణా వ్యవస్థ లో విధులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నరన్నారు.ఈ కార్యక్రమంలోసంస్థ అధ్యక్షులు దాసోజు శ్రీనివాస్ డాక్టర్ దాసోజు శోభారాణి, ఎరుక సాహితీ వేదిక కార్యదర్శి లలిత న్యాయవాద శోభారాణి,ప్రధాన కార్యదర్శి పెందోట సోముబొడ్డుపల్లి రామకష్ణ తదితరులు పాల్గొన్నారు.