Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొండమడుగు నరసింహ
నవతెలంగాణ -వలిగొండ
ఈ నెల 21, 22 తేదీల్లో మండలం లోని పులిగిల్ల గ్రామంలో నిర్వహించనున్న ప్రజానాట్యమండలి రెండవ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ప్రజానాట్యమండలి ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ కార్యదర్శి కొండమడుగు నరసింహ కోరారు. మంగళవారం మండలంలోని దాసిరెడ్డిగూడెం గ్రామంలో ప్రజానాట్య మండలి జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు గంట పాక శివ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ నాటి తెలంగాణ సాయుధ పోరాటం నుండి నేటి వరకు కొనసాగుతున్న అనేక పోరాటాల్లో పాలకుల ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజానాట్యమండలి తమ ఆట పాట మాట పల్లె సిద్ధులు ,వీధి నాటకాలు ద్వారా ప్రజల్ని చైతన్యం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి దేశ పాక రవి ,రాష్ట్ర కమిటీ సభ్యులు మేడి ముకుంద ,నాయకులు శ్రీ రాములు, రాజమల్లు, వీర్లపల్లి ముత్యాలు ,శ్రీకాంత్ ,గుండు నరసింహ, కందుల హనుమంతు, బిక్షపతి శ్రీకష్ణ, మురళి కొమ్ము స్వామి, తదితరులు పాల్గొన్నారు.