Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చండూరు
మండలంలోని గుండ్రపల్లి, కస్తాల గ్రామాలలోని వివిధ రైతుల యాసంగి పంటలైన వరి, వేరుశనగ , మినుముల పంటల క్షేత్రాలను మండల వ్యవసాయ అధికారి పి. మల్లేష్ గ్రామ వ్యవసాయ అధికారి శోభ, విజయ తో కలిసి బుధవారం పరిశీలించారు. ప్రస్తుతం వరిలో జింకు లోపం అగ్గి తెగులు ఎక్కువగా ఉన్నదని రైతులకు తెలిపారు. వీటి నివారణకు రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలని సూచించారు. అగ్గి తెగులు కి ట్రైసైక్లాజోల్ అనే మందు 0. 6 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ శోభారాణి, విజయ ఆర్బిఎస్ కోఆర్డినేటర్ బుర్రి వెంకట రెడ్డి, వీఆర్ఏ శివారెడ్డి మరియు ఇతర రైతులు పాల్గొన్నారు.