Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగార్జునసాగర్
ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో వెలిసిన మత సామరస్యానికి ప్రతీకగా వెలుగొందుతున్న మేరీమాతా ఉత్సవాల్లో మూడోరోజు బుధవారం దివ్యబలి పూజా కార్యక్రమం సాగింది.ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణ మహాగణ డాక్టర్ చిన్న బత్తిన భాగ్యయ్య, మహాగణ డాక్టర్ గాలిబలి, నల్లగొండ జిల్లా పీఠాధిపతులతో వాక్య పరిచర్య అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రెవరెండ్ ఫాదర్ చిన్నబత్తిని హృదయకుమార్, స్థానిక గురువులు పర్య వేక్షణలో జరుగుతుండడం విశేషం.మూడవ రోజు చివరి రోజు కావడంతో భక్తులు అధికసంఖ్యలో ఆలయాన్ని దర్శించుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు.