Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
ఈనెల 7వ తేదీన మేళ్లచెరువు మండల కేంద్రంలో జరిగిన మత్స్య కార్మికసంఘం జిల్లా మహాసభలలో పట్టణానికి చెందిన శీలం శ్రీను మత్స్య కార్మికసంఘం జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా ఆయన బుధవారం విలేకర్లతో మాట్లాడారు.సహాయ కార్యదర్శులుగా వేముల రాము, పిట్టల నాగేశ్వర్రావు, కంటు మల్లయ్య,ఉపాధ్యక్షులుగా నాగసైదులు, పోషణబోయిన హుస్సేన్, దేశబోయిన వీరయ్య, గుండెబోయిన సముద్రం, మండె వెంకన్న, నార్ల వీరబాబు ఎన్నికయ్యారన్నారు.జిల్లాలో మచ్చ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తన వంతు కషి చేస్తానని అన్నారు కాంట్రాక్టర్ ద్వారా కాకుండా చెరువుల్లో చేప పిల్లలు వేసే అవకాశాన్ని సొసైటీలకు ఇవ్వాలన్నారు 50 సంవత్సరాలు దాటిన మత్స్యకారులకు పెన్షన్ లను ప్రభుత్వం మంజూరు చేయాలన్నార తదితర సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తామన్నారు.