Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోదాడరూరల్:మండలపరిధిలోని చిమిర్యాల గ్రామ పరిధిలోని వరిపంట పోలాలను మండల వ్యవసాయ అధికారులు బుధవారం పరిశీలించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారిని రజిని మాట్లాడుతూ ప్రస్తుతం వరిపంటలో పురుగులు,తెగుళ్ళ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు వివరించామన్నారు.మొగిపురుగు నివారకు కార్టప్ హైడ్రోక్లోరైడ్ 50 శాతం, సల్పొడి 2.5 గ్రామ్ లీటర్ నీటికి కలిపి ఒక ఎకరాకు 250 గ్రాములచొప్పున పిచికారీ చేయాలన్నారు.అగ్గి తెగులు నివారణకు ట్రయోక్లజోల్ 75 శాతం ఎకరానికి 120 గ్రామ్ 100 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఏఈవో ఝాన్సీ, రైతులు పాల్గొన్నారు.