Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -రామన్నపేట
ఉమ్మడి నల్లగొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో గల స్థానిక శ్రీహిందూ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న డిగ్రీ ప్రథమ సెమిస్టర్, తతీయ సెమిస్టర్ పరీక్షాలను శుక్రవారం యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ డాక్టర్ మిర్యాల రమేష్ కుమార్, కె.అరుణ ప్రియ తో కలిసి అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షలు సజావుగా నిర్వహించేలా ఆయా కళాశాలల యాజమాన్యాలు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారు. పరీక్షలు నిర్వహిస్తున్న అన్ని కేంద్రాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఇన్విజిలేటర్లు, రిలీవర్ లను సమకూర్చుకోవాలని చీఫ్ సూపర్డెంట్ లను ఆయన ఆదేశించారు.