Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
విద్యాభివృద్ధికి దివీస్ పరిశ్రమ అందిస్తున్న కృషి ఎంతో అభినందనీయమని కౌన్సిలర్లు ఆలె నాగరాజు, ఉబ్బు వరమ్మవెంకటయ్యలు తెలిపారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని తంగడపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు రూ.26,99,882 విలువ గల డ్యూయల్ డెస్క్ బెంచీలు, 100 ఎల్పీహెచ్ ఆర్ఓ ప్లాంట్లు మూడు, నోట్ పుస్తకాలు, షఉ, సాక్స్, బ్యాగులు, హార్లిక్స్ ప్యాకెట్స్ తదితర వస్తువులను అందజేశారు. వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అశ్విన్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, దివీస్ అధికారులు వల్లూరి వెంకటరాజు, సాయికృష్ణ పాల్గొన్నారు.