Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేష్
నవతెలంగాణ-మిర్యాలగూడ
శాస్త్రీయ విద్య విధానానికి పోరాడాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేష్ అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ మిర్యాలగూడ డివిజన్ మహాసభను మిర్యాలగూడ పట్టణంలోని వాసవి భవన్లో నిర్వహించారు. ఈ మహాసభకు మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నుండి, పట్టణంలోని అన్ని విద్య సంస్థల నుండి విద్యార్థి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యయన పోరాటం అనే నినాదంతో శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడుతున్న ఏకైక విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ అని అన్నారు. పాలకులు మతోన్మాదంతో కూడిన కాషాయ విద్యను చొప్పిం చాలని ప్రయత్నం చేస్తున్నారని, దానికి వ్యతిరేకంగా విశాలమైన విద్యార్థి ఉద్యమాన్ని నిర్వహించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రవినాయక్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకారపు నరేష్, కంభంపటి శంకర్, అవాజ్ జిల్లా అధ్యక్షులు అంజద్, రైతు సంఘం జిల్లా నాయకులు రాగిరెడ్డి మంగరెడ్డి, నాయకులు సైదా, శ్రీకాంత్, జగన్, వదూద్, వంశీ, ముని, వీరన్న, లాచిరం శ్రవణ్, బాబు నాయక్, వినోద్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.