Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ
నవతెలంగాణ - మోటకొండూరు
రైతులకు ఇస్తున్నట్టు వ్యవసాయ కూలీల కూడా రైతు బీమా పథకాన్ని వర్తింపజేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరుగాలం రెక్కల నమ్ముకుని వ్యవసాయం మీద ఇతర పనుల మీద ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ కూలీలు అనేక ప్రమాదాలకు పనిప్రదేశాల్లో గురవుతున్న పరిస్థితి ఉన్నదన్నారు. చాలా మంది కార్మికులు పనులకు పోతున్నప్పుడు యాక్సిడెంట్లకు గురౌతు చేతులు, కాళ్లు ప్రాణాలు పోగొట్టుకున్నారన్నారు. పనిప్రదేశాల్లో పాములు, తేళ్లు కుట్టడం వల్ల ప్రాణాలు కూడా పోతున్నాయని కాని వీరికి ప్రభుత్వం ఎలాంటి ఎక్స్గ్రేషియా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికైనా వ్యవసాయ కూలీలను ఆదుకోవడానికి రైతులకు ఇస్తున్న రైతు భీమా పథకం లాంటి పథకం కూలీలకు కూడా ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఈనెల 15వ తేదీన వలిగొండ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న జిల్లా విస్తతస్థాయి రాష్ట్ర అధ్యక్షులు జి .నాగయ్య,ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి.జహంగీర్ హాజరుకానున్నట్టు తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకత్వం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఆ సంఘం నాయకులు కొల్లూరి నాగరాజు, వంగపల్లి సాయులు, చీరాల ఉపెందర్, రెగు ఐలయ్య, వడ్డెబోయిన స్వామి, కొల్లూరి నర్శయా తదితరులు పాల్గొన్నారు.