Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దామరచర్ల
మండలంలోని పలు గ్రామాల్లో సీపీఐ(ఎం), ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమస్యలపై సర్వే నిర్వహించినట్లు ఆ పార్టీ మండల కార్యదర్శి వినోద్ నాయక్ అన్నారు. దామరచర్లలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. మండలంలోని కొన్ని గ్రామాలలో పార్టీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడానికి సర్వేలు నిర్వహించినట్లు తెలిపారు. సర్వేలో అనేక మందికి పింఛన్లు, ఇండ్లు రేషన్ కార్డులు లేవని, అనేక గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థ అస్త వ్యస్తంగా ఉందని తెలిసినట్లు చెప్పారు.వీటిపై అధికారులకు వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. సమస్యలను పరిష్కరించక పోతే ప్రజలందరినీ సమీకరించి దామరచర్ల మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాపా నాయక్, దయానంద్, ఖాజా మొయినుద్దీన్, గోపి, శ్రీహరి, రవి పాల్గొన్నారు.