Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
నవతెలంగాణ-దేవరకొండ
దేవరకొండ మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని స్థానిక శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం దేవర కొండ పట్టణంలోని 3వ వార్డులో రూ.9 లక్షలతో చేపడుతున్న డ్రెయినేజీ పనులకు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రెయినేజీ పనులు నాణ్యతతో త్వరగతిన పూర్తి చేయాలని ఆయన కోరారు. పట్ట ణంలో పారిశుధ్య నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్ట నున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ అల్లంపల్లి నర్సింహ, మార్కెట్ కమిటీ చైర్మెన్ సిరందాసు లక్ష్మమ్మకృష్ణయ్య, రైతుబంధు అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, మున్సిపల్ వైస్ చైర్మెన్ రహత్ అలీ, కమిషనర్ వెంకటయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హన్మంత్ వెంకటేష్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, వడిత్య దేవేందర్, కౌన్సిలర్లు రజియాసుల్తానా, పొన్నబో యిన సైదులు, మూడావత్ జయప్రకాష్ నారా యణ, మహమ్మద్ రైస్, వేముల రాజు, చిత్రం ప్రదీప్ పాల్గొన్నారు.