Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
హత్య కేసులో నిందితులను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాలకీడు మండలం చెరువుతండా గ్రామంలో ఈనెల 7వ తేదీన ఇంటి వాటా పంపకం విషయంలో బానావత్ వెంకట్ రామ్ను అదే గ్రామానికి చెందిన ఆయన తమ్ముడు సైదా, అతని భార్య రంగి కొట్టి తీవ్రంగా గాయపరిచారు. దాంతో వెంకట్ రామ్ ఈనెల 8వ తేదీన చనిపోయాడు. మృతుడి కుమార్తె బంగారి ఫిర్యాదు మేరకు పాలకీడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. దాంతో నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు ఆయన తెలిపారు. సమావేశంలో పాలకవీడు ఎస్ఐ సైదులు గౌడ్ పాల్గొన్నారు.