Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేములపల్లి
ప్రతి గ్రామంలో దళిత బంధు అమలు చేయాలని కేవీపీఎస్ జిల్లా నాయకులు రెమిడాల పరశురాము లు అన్నారు. గురువారం మండలం లోని అన్నపురెడ్డిగూడెంలో ఆ సంఘం ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించి దళితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రజలపై గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యావసరాల ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులు పెడుతుందని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తానన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను, మూడెకరాల భూమిని అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ మండల ప్రధాన కార్యదర్శి కొదమ గుండ్ల వెంకన్న, పగిడిపల్లి వెంకటేశ్వర్లు, కాశయ్య, గోపమ్మ, మట్టయ్య, మల్లమ్మ, దేవకమ్మ, తదితరులు పాల్గొన్నారు.