Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మర్రిగూడ
చర్లగూడ ముంపు గ్రామస్తులు, భూనిర్వాసితులు తమకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని తలపెట్టిన ధర్నా బుధవారంతో తొమ్మిదవ రోజు కొనసాగింది.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమకు ప్రభుత్వం అందించాల్సిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీతో పాటు పునరావాస తక్షణచర్యలు చేపట్టే వరకు ధర్నాను కొనసాగిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎరుకల యాదయ్య, కొత్త ఎల్లయ్య, వల్లపు కేశవులు, కుంచెపు కొండయ్య, ఎరుకల రాములు ,కొత్త మారమ్మ, మాధగోని శ్రీను, ఎరుకల నిరంజన్, జంగయ్య, లాలమ్మ తదితరులు పాల్గొన్నారు.