Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలాసత్పతి
నవతెలంగాణ-భువనగిరిరూరల్
సమాజ అభ్యున్నతికి భాగ్యరెడ్డి వర్మ చేసిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో భాగ్యరెడ్డి వర్మ జయంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి ఆమె పూలమాలలేసి నివాళులర్పించి మాట్లాడారు.దళిత వైతాళికుడుగా ప్రసిద్ధి చెంది, సమసమాజస్థాపనకు ఆయన ఎన్నో సేవలు చేశారన్నారు.దళిత బాలికల పాఠశాలలను స్థాపించి వారి అభివద్ధికి పునాదులు వేశారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివద్ధి అధికారి ఎం.ఉపేందర్రెడ్డి, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యాంసుందర్, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్కుమార్, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్ కష్ణ, అధికారులు పాల్గొన్నారు.