Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవూర
మండలంలోని పోతునూరు గ్రామానికి చెందిన పెండ్యాల నందినికి న్యాయంచేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు కంకణాల నివేదితరెడ్డి ప్రభుత్వాన్ని,అదికారులను డిమాండ్ చేశారు.ఆదివారం రాత్రి మండలంలోని పోతునూరుస్టేజి సాగర్-హైదరాబాద్ ప్రధానరహదారిపై నందిని,అత్త మామ,భర్తపై కేసు నమోదు చేయాలని ధర్నా నిర్వహించారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పోతునూరు గ్రామానికి చెందిన పెండ్యాల గురువారావు కుమారుడు రవీందర్ రావు తో 13 సంవత్సరాల క్రితం నందిని వివాహం అయిందని, వారికి11 సంవత్సరాల ఒక కూతురు కూడా ఉందని ఇప్పుడు అదనపు కట్నం కోసం నందినిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.13 ఏండ్ల నుంచి పోతునూరు గ్రామంలో అత్తమామ దగ్గర జీవనం గడుపుతుందని తెలిపారు. భర్త రవీందర్ రావు నందిని అంటే ఇష్టం లేక వాళ్ళ అమ్మను, నాన్నను, వాళ్ళ చెల్లే ఇంటికి పంపించి ఈమెను బయటకు గెంటేసి ఇంటికి తాళం వేశారని, ఇది దారుణమన్నారు.13 రోజుల నుంచి ఇంటి ముందే గడుపుతూ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినా న్యాయం జరగలేదన్నారు.ఈవిషయమై పోలీసులకు, సర్పంచ్కు ఫోన్ చేసినా స్పందన లేదన్నారు.దీంతో హైదరాబాద్, నాగార్జునసాగర్ టు హైదరాబాద్ హైవేపై అదివారం రాత్రి పోతునూరు గ్రామం ఊరు ప్రజలు మద్దతుతో ధర్నా చేయడం జరిగిందని తెలిపారు.నందినికి ి న్యాయం జరగకపోతే ఎస్పీని ఆశ్రయిస్తామన్నారు.పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వారితో మాట్లాడి ధర్నా విరమించేలా చేసి ట్రాఫిక్ జామ్లేకుండా చర్యలు తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు ఏరుకొండ నర్సింహ, ఎస్టీ మోర్చా నాగార్జునసాగర్ కన్వీనర్ పి.శంకర్నాయక్, కత్తి శంకర్రెడ్డి,మహిళా మోర్చా అధ్యక్షురాలు చెన్నంగంగా, ప్రధాన కార్యదర్శి యేరుకొండ పద్మ, సునీత, దుర్గమ్మ, అలివేలు, జయమ్మ, భాగ్యమ్మ,శారద, వెంకటమ్మ, కలమ్మ పాల్గొన్నారు.