Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్
నవతెలంగాణ-దేవరకొండ
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.సోమవారం నేరేడుగొమ్ము మండలం ధర్మ రేఖ తండా, పందిరిగుండుతండా, పలుగుతండా, కొత్తపల్లి, నేరేడుగొమ్ము, పేర్వాల, గ్రామాలలో పలు అభివద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో గ్రామగ్రామాన శ్మశానవాటికలు, పల్లె ప్రకతివనాలు, మిషన్ భగీరథ త్రాగునీరు, డంపింగ్ యార్డులు మంజూరు చేసిందన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లి గ్రామంలో రూ.13. 67 లక్షలతో, పందిరి గుండు తండాలో రూ 8. 77 లక్షలతో, నేరేడుగొమ్ములో రూ 11. 45 లక్షలతో, పలుగుతండాలో రూ.6.62 లక్షలతో పాఠశాల అభివద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. పేర్వాల గ్రామంలో రూ.15 లక్షలతో నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ను ప్రారంభించారు. రూ.5 లక్షలతో నిర్మించిన సీసీరోడ్డు పనులను, రూ.8 లక్షల రూపాయలతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాణావత్ పద్మ, జెడ్పీటీసీ నేనావత్ బాలు, తిరందాసు కష్ణయ్య, బాలయ్య, లోకసాని తిరుపతయ్య, కొండల్ రెడ్డి, బొడ్డుపల్లి కష్ణ, ఆరెకంటి ముత్యాలమ్మ, రాములు, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ డీఈఈలు నాగేష్, లింగారెడ్డి, రాజు, ఎంపీడీవో ఝాన్సీ రాణి తదితరులు పాల్గొన్నారు.