Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
పట్టణంలోని .తహసీల్దార్ కార్యాలయం నుంచి రామాపురం వరకు రోడ్డు విస్తరణలో భాగంగా తమకు సమాచారం ఇవ్వకుండా, అంగీకారం లేకుండా రోడ్డు విస్తరణ పనులు చేపట్టారని, వెంటనే పనులను ఆపాలని రైతులు తహసీల్దార్ వాసిమల్ల సరితకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో రైతులు జంగిలి సోమయ్య, జంగిలి సైదులు, పాశంశ్రీను, మహిళారైతులు అంకమ్మ, చందమల్ల లక్ష్మయ్య, శ్రీను,నరేష్, సైదులు, శ్రీహరి,ఝాన్సీ ఉన్నారు.