Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లగొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
నవతెలంగాణ -నల్లగొండ ప్రాంతీయప్రతినిధి
పట్టణంలో జరుగుతున్న రోడ్ల విస్తరణ, అభివద్ధి, సుందరీకరణ, పార్కుల అభివద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం పట్టణంలో జరుగుతున్న రోడ్ల విస్తరణ, అభివద్ది, పార్కుల అభివద్ది పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. చర్లపల్లిలో అర్బన్ పార్కు పనులు పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు. పార్కును నాలుగు జోన్లుగా ఏర్పాటు చేస్తున్నామని అందులో పిక్నిక్ జోన్, ఎడ్యుకేషన్ జోన్, పిల్లల కోసం ప్లే జోన్, ఫోటో జోన్ గా విభజిస్తున్నామని తెలిపారు.అంతేగాక క్యాంటీన్ సౌకర్యం, మంచినీటి సౌకర్యం, టారు లెట్స్, వాహనాల కోసం పార్కింగ్ మొదలగు సౌకర్యాలు ఉండనున్నట్టు వివరించారు. పార్కు మొత్తం నీటి సరఫరా జరిగే విధంగా పైపు లైన్ పనులు వెంటనే పూర్తి చేయాలని సంబంధిత ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించారు. డ్రయినేజీ కాలువ వెంట నిర్మిస్తున్న కాంక్రీట్ గోడను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జాతీయ రహదారి నుండి పార్కు వరకు మెయిన్ రోడ్డుకు అనుబంధంగా ఇంటర్ లాకింక్ టైల్స్ అందంగా తీర్చిదిద్దాలన్నారు. మర్రిగూడ బైపాస్ నుండి స్వామి వివేకానంద విగ్రహం వరకు డివైడర్లు పూర్తి అయినందున మొక్కలు నాటడానికి తగు చర్యలు తీసుకుని ఈ నెల చివరికల్లా పూర్తి చేయాలని తెలిపారు. స్వామి వివేకానంద విగ్రహం నుండి క్లాక్ టవర్ వరకు డివైడర్ల పనులను వెంటనే ప్రారంభించాలని కాంట్రాక్టర్లను, రోడ్డు విస్తరణ పనులు వేగంగా జరగాలని ఇంజనీర్లను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఎలక్ట్రీకల్ టవర్స్, ట్రాన్సుఫార్మర్ల పనులను స్వయంగా పర్యవేక్షించాలని మున్సిపల్ కమిషనరనుఆదేశించారు. ఇంజనీర్లు, ఏజెన్సీ వారు రోడ్ల విస్తరణ, ఎలక్ట్రికల్, సుందరీకరణకు సంబంధించి అన్ని రకాల మెటీరియల్స్ ను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాల పక్కన కెనాల్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసే సుందరీకరణ గురించి మున్సిపల్ కమిషనర్, ఏజెన్సీ వారితోచర్చించారు. వీటీకాలనీ, ఎల్వి. పెట్రోల్ బంక్, ఉడిపి హోటల్, తదితర ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పరిశీలించి మార్కింగ్ చేసిన ప్రకారం రోడ్ల పనులను నాణ్యతా ప్రమాణాలు స్వయంగా పరిశీలించారు. అనంతరం దేవరకొండ రోడ్డులో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. ఈ రోడ్డులో ఎలక్ట్రికల్ టవర్లు ఎంత మేరకు ఏర్పాటు చేశారు, ఇంకా ఎన్ని టవర్లు ఏర్పాటు చేయాల్సి ఉందని అడిగి తెలుసుకున్నారు. ఈ వారం రోజులలో దేవరకొండ రోడ్డు విస్తరణలో భాగంగా ఎలక్ట్రికల్ టవర్ల ఏర్పాటు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బీట్ మార్కెట్ లో ఏర్పాటు చేస్తున్న వెజ్, నాన్ వెజ్ మార్కెట్ పనులను పరిశీలించారు. బీట్ మార్కెట్ లోని మార్కెటింగ్ గోదాము, మార్కెటింగ్ శాఖ ఆధీనంలోని భవన నిర్మాణం ధ్వంసం చేస్తున్న పనులను పరశీలించారు. ప్రకాశం బజార్ లోని మైసయ్య సర్కిల్ లో ఏర్పాటు చేస్తున్న అన్నపూర్ణ క్యాంటీన్ పనులను పరిశీలించారు. అక్కడే చిన్న పార్కు నమూనాలను పరిశీలించి తగు సూచనలు చేశారు.పార్కులో పబ్లిక్ కోసం సీటింగ్ బెంచీలు ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటి వరకు జరిగిన పనులపై ప్రగతి నివేదికలు తనకు సమర్పించాలని సంబంధిత అధికారులను, ఇంజనీర్లను ఆదేశించారు. ముందుగా మర్రిగూడ బైపాస్ వద్ద మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో డివైడర్ మధ్యలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్మందడి సైదిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ డా. కె.వి రమణాచారి, మున్సిపల్ వైస్ చైర్మెన్అబ్బగోని రమేష్, ఎస్పీడీసీఎల్ డీఈ విద్యా సాగర్,మార్కెటింగ్ అధికారి శ్రీకాంత్, కౌన్సిలర్లు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, ఏజెన్సీ నిర్వాహుకులు, తదితరులు పాల్గొన్నారు.