Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు మండల కేంద్ర బంద్ విజయవంతం చేయాలి
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
అఖిలపక్ష నాయకుల పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, ఎంపీపీి ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి దౌర్జన్యానికి అండగా నిలుస్తున్న ఎస్ఐని సస్పెండ్ చేయాలని, ఆక్రమిత స్థలాన్ని రక్షించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి బుధవారం మండలకేంద్రంలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అంగడి స్థలాన్ని కబ్జా చేసిన ఉమా ప్రేమ చందర్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మునుగోడు మాజీ ఎమ్మెల్యే,ఈ ప్రాంత టిఆర్ఎస్ నాయకులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అఖిలపక్ష నాయకుల పై తప్పుడు కేసులు బనాయిస్తూ తమ అధికార పలుకుబడితో పోలీసు అధికారులను ఉపయోగించుకుంటున్నారన్నారు. ఈ గ్రామంలో ఉండే ప్రజలు,దళితులు, అఖిలపక్ష నాయకులు, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ సెక్రెటరీ, మరికొంత మంది ప్రజా నాయకుల పై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడం మానుకోవాలన్నారు. నేడు నిర్వహించనున్న మండల కేంద్రం బంద్ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మందుగుల బాలకష్ణ, చిలువేరు అంజయ్య,సూరపెళ్లి శివాజీ,వలిగొండ యాదయ్య,తెలంగాణ బిక్షం,పేరే రమేష్, బద్దుల యాదగిరి,రేవనపల్లి గోపాల్, మైలారం రాములు,ఎండి నయం షరీఫ్,చిలువేరు పెంటయ్య,ఎర్రోళ్ల లక్ష్మయ్య, ఉప్పర బోయిన సంజీవ ఎం డి ముస్తఫా ఖాన్ రవి చిలువేరు సోమయ్య,ఉప్పర బోయిన నగేష్ తదితరులు పాల్గొన్నారు.