Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్షా కేంద్రాలను కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం పరిశీలించారు. మౌలిక సదుపాయాల, విద్యార్థుల హాజరు శాతం ఇతర ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.
99.1 శాతం హాజరు.
జిల్లాలో పదవ తరగతి పరీక్షల్లో 35 కేంద్రాలలో విద్యార్థులు 99.1 శాతం హాజరయ్యారు 9479 విద్యార్థులకు గాను, 9394 మంది విద్యార్థులు హాజరుకాగా 85 మంది గైర్హాజరయ్యారు. సిట్టింగ్ స్క్వాడ్ మూడు టీములు ఫ్లయింగ్ స్క్వాడ్ము నాలుగు టీంలు పరీక్షల్లో అవకతవకలు జరగకుండా తనిఖీలు చేశారు.