Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
రోజురోజుకు పెంచుతున్న ధరలను నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యీయని, దానికి ప్రత్యేకంగా ఈనెల 27 నుండి 31 వరకు గ్రామాలలో జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఎస్కె.యాకుబ్ కోరారు.బుధవారం మండలకేంద్రంలోని ఎంఎస్.భవనంలో దోసపాటి భిక్షం అధ్యక్షతనలో నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ కార్యక్రమంలో తుమ్మల సైదయ్య,బి.శ్రీనివాస్, మచ్చ వెంకటేశ్వర్లు, నందిపాటి మట్టయ్య,పటాన్,మైబోలి పాల్గొన్నారు.